హైదరాబాద్లో మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మనీషా కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకుంది. వారం రోజుల క్రితం పురుగుల మందు తాగిన ఆమె చికిత్స పొందుతూ మరణించింది. భర్త వేధింపుల వల్లే ఈ దారుణానికి ఒడిగట్టిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.