విశాఖపట్నం జిల్లాలోని భీమిలిలో ఓ యువకుడు లాడ్జిలో బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. విశాఖపట్నంలోని కోటవీధి ప్రాంతానికి చెందిన శ్యామ్ కుమార్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారు. ఈ క్రమంలోనే అక్కడే ఓ యువతితో శ్యామ్కుమార్కు పరిచయమైంది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావటంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో శ్యామ్కుమార్ మీద జీడిమెట్లలో కేసు నమోదైంది. దీంతో భయపడిపోయిన శ్యామ్కుమార్ భీమిలిలోని ఓ లాడ్జిలో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.