హైదరాబాద్లో భారీ భూ కుంభకోణాన్ని అధికారులు, పోలీసులు పసిగట్టారు. రూ.1500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రయత్నించారని తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటికి వచ్చింది. తహసీల్దార్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ వ్యవహారంలో కీలక ఆధారాలు సేకరించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.