తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ శుక్రవారం ప్రారంభమై ఆగస్టు 10 వరకు కొనసాగనుంది. మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో పంపిణీ జరుగుతుండగా, హైదరాబాద్లో మాత్రం మంత్రి అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది. నగరంలో 2 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, సిబ్బంది కొరతతో విచారణ ఆలస్యమవుతోంది. ఇప్పటివరకు కొద్ది శాతం దరఖాస్తులనే పరిశీలించారు. పెండింగ్ దరఖాస్తుల విచారణను జీహెచ్ఎంసీకి అప్పగించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇది చదవండి.