హైదరాబాద్లో ఏప్రిల్ 2న జరగనున్న శ్రీ హనుమాన్ విజయ యాత్ర - 2026 పురస్కరించుకుని నగర ట్రాఫిక్ పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్బండ్ వరకు సాగే ప్రధాన ఊరేగింపుతో పాటు వివిధ అనుబంధ యాత్రల నేపథ్యంలో ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయి. కోఠి, అబిడ్స్, నారాయణగూడ, సికింద్రాబాద్ వంటి కీలక ప్రాంతాల్లో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.