హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బూమ్ గత కొన్నేళ్లలో భారీగా పెరిగిపోయింది. నగరంలో ఎక్కడ చూసినా గజం లక్షల్లో పలుకుతోంది. ఇక సర్కార్ భూములను విక్రయించేందుకు ప్రభుత్వం నిర్వహించే వేలంలో రికార్డు ధరలు మోగుతున్నాయి. తాజాగా రాయదుర్గంలో చదరపు గజానికి ఏకంగా రూ.3.40 లక్షలు పలికి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే 8 ఏళ్లలోనే ఆ భూమి ఏకంగా 4 రెట్లు పెరగడం గమనార్హం.