తెలంగాణలోని పేద, అల్ప ఆదాయం, మధ్యతరగతి ప్రజలకు గుడ్న్యూస్. తక్కువ ధరకే హైదరాబాద్ నగరంతో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్ వంటి పట్టణాల్లో ఇళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రేవంత్ సర్కార్ ఎఫర్డబుల్ హౌసింగ్ పాలసీని సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఇళ్ల నిర్మాణానికి ముసాయిదాను రూపొందించనుంది.