హైదరాబాద్ నగరవాసుల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. గత కొన్ని నెలలుగా తీవ్రమైన ఎండతో.. భూగర్భంలో నీటిమట్టం తగ్గిపోయి.. నీటి కొరత వేధించింది. తాజాగా అడపాదడపా వర్షాలు కురవడంతో జంట జలాశయాలకు భారీగా వరద నీరు పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతోంది.