హైదరాబాద్ చెరువుల్లో మట్టి, వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. నిరంతర నిఘా ఉంటుందని, నేరుగా క్రిమినల్ కేసులు పెడతామన్నారు. బిల్డర్లు, ట్రాన్స్పోర్టర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేసి, యజమానులపై కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. సమాచారం ఇవ్వడానికి ఫోన్ నంబర్, ట్విట్టర్ అందుబాటులో ఉంచారు.