హైదరాబాద్ లోకల్ ట్రైన్ ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను అందించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 15న మూడు ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లను నడుపుతున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు ఉందానగర్-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, లింగంపల్లి-ఉందానగర్ మార్గాల్లో అందుబాటులో ఉంటాయి.