హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని.. రైలు ప్రయాణ సమయాలను పొడిగించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుండి ఈ మార్పులు అమలులోకి వచ్చాయి. రాత్రి 12 గంటలకు కూడా మీరు మెట్రోలో ప్రయాణం చేయవచ్చు. దీంతో రాత్రిళ్లు పని చేసుకొని ఇంటికి వెళ్లే వారికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడనుంది. ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉన్నా.. ప్రస్తుతం అమల్లోకి వచ్చింది. ఛార్జీల పెంపు అంశాన్ని అధ్యయనం చేయనున్నట్లు మెట్రో అధికారులు పేర్కొన్నారు.