హైదరాబాద్ నగర ప్రజలకు శుభవార్త. జీహెచ్ఎంసీ నగరంలో పచ్చదనం పెంచేందుకు కొత్త పార్కులను నిర్మించనుంది. రూ.30 కోట్ల వ్యయంతో మూడు జోన్లలో 56 ఎకరాల్లో నాలుగు పార్కులు రూపుదిద్దుకోనున్నాయి. పాత పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు కొత్త వాటిని నిర్మించనున్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఈ పార్కులు నగరవాసులకు ఆహ్లాదకరమైన ప్రదేశాలుగా మారనున్నాయి.