హైదరాబాద్ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరిపోనున్నాయి. ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలో లింకు రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా రోడ్ల నిర్మాణం ఉండాలన్నారు. అందుకు అవసరమైన భూసేకరణ చేపట్టాలని సూచించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రహదారుల నిర్మాణం ఉండాలన్నారు.