ఏపీని మొంథా తుపాను వణికిస్తోంది. తుపాను కారణంగా పలు బస్సులు, రైళ్లు, విమానాల సర్వీసులను రద్దు చేశారు. విజయవాడ నుంచి నిత్యం 400 బస్సు సర్వీసులు నడుస్తుంటాయి. అయితే తుపాను కారణంగా 139 బస్సు సర్వీసులను తాత్కాళికంగా రద్దు చేశారు. హైదరాబాద్, కాకినాడ, విశాఖవైపు వెళ్లే బస్సులు రద్దు చేశారు. దీంతో బస్టాండు ప్రయాణికులు లేక వెలవెలబోతోంది. బుకింగ్స్ కూడా సగానికి సగం పడిపోయాయని అధికారులు చెప్తున్నారు.