హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవే-65 విస్తరణ విషయంలో కీలక ముందడుగు పడింది. ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న రోడ్డును 6 లైన్లుగా విస్తరించనుండగా.. DPR రూపొందించే బాధ్యతల్ని మధ్యప్రదేశ్కు చెందిన ఓ సంస్థ దక్కించుకుంది. ఈ నెలాఖరుకల్లా ఈ సంస్థతో NHAI ఒప్పందం ఖరారు కానుంది. తెలంగాణలోని దండు మల్కాపూర్ నుంచి ఏపీలోని గొల్లపూడి వరకు 265 కి.మీ మేర హైవే విస్తరణ జరగనుంది.