హైదరాబాద్-విజయవాడ హైవేపై.. ఆ ప్రదేశంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్..

4 months ago 10
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై హయత్‌నగర్ సమీపంలో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భాగ్యలత , లెక్చరర్స్ కాలనీ వద్ద పాదచారుల పైవంతెనలను(ఫుట్ ఓవర్ బ్రిడ్జి) మూడు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణ పనులకు ఆస్తి యజమానులు అడ్డుపడుతూ కోర్టు ఉత్తర్వులు తెస్తున్నారనే అంశంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు ముఖ్యం కాబట్టి, అవసరమైతే పోలీసు బందోబస్తు మధ్య పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే అధికారులు వంతెన నిర్మాణ స్థలాలను పరిశీలించారు. ఈ పనులు పూర్తయితే ఎన్‌హెచ్‌ 65పై ప్రయాణికులు సురక్షితంగా రహదారి దాటే అవకాశం లభిస్తుంది.
Read Entire Article