ప్రతీ నిత్యం రద్దీగా కనపడే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పండగల సమయంలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే ఈ హైవేపై ప్రస్తుతం మొంథా తుఫాను కారణంగా రోడ్డుపై నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా చిట్యాల రైల్వే బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఇక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతే కాకుండా.. ఇక్కడ ఫ్లై ఓవర్ నిర్మిస్తుండటంతో కూడా ఈ ట్రాఫిక్కు మారో కారణంగా మారింది.