Rajahmundry Airport Air Buses From December 16: ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా ఎయిర్బస్లు అందుబాటులోకి రానున్నాయి. రాజమహేంద్రవరం నుండి హైదరాబాద్కు ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ ఈ నెల 16 నుండి రెండు ఎయిర్బస్ సర్వీసులను ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతోంది. ఈ సర్వీసుల ద్వారా ప్రయాణికుల సామర్థ్యం 600 నుండి 800కి పెరిగే అవకాశం ఉంది. బెంగళూరుకు కూడా అలయన్స్ ఎయిర్ కొత్త విమాన సర్వీసును ప్రారంభించే యోచనలో ఉంది.