హైదరాబాద్ వేదికగా జరిగిన ‘యూఎస్-ఇండియా ట్రస్ట్’ సదస్సు భారత్-అమెరికా దేశాల మధ్య సాంకేతిక సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. కృత్రిమ మేధ (AI), సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. 2025లో ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించిన ఈ ఇనిషియేటివ్ ద్వారా సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్ వంటి కీలక రంగాల్లో విద్యాసంస్థలు, పరిశ్రమలు కలిసి పనిచేయనున్నాయి. అమెరికా జాతీయ భద్రతను కాపాడుతూనే.. భారత ఆర్థిక అవకాశాలను విస్తరించడం ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశం.