హైదరాబాద్ శివారులో అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌.. త్వరలోనే టెండర్లు, మంత్రి కీలక ప్రకటన

1 week ago 4
హైదరాబాద్ శివారు కోహెడలో ఆసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ పండ్ల మార్కెట్ నిర్మాణానికి సర్వే పూర్తి కావడంతో త్వరలో టెండర్లు పిలవనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రూ. 1000 కోట్ల వ్యయంతో 200 ఎకరాలకు పైగా నిర్మించే ఈ గ్లోబల్ గ్రీన్ మార్కెట్ ఎగుమతులకు కేంద్రంగా మారనుంది. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం కావాలని, కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అక్రమాలకు పాల్పడే వ్యాపారుల లైసెన్స్‌లు రద్దు చేస్తామని, రైతులకు నేరుగా నగదు జమ చేస్తామని స్పష్టం చేశారు.
Read Entire Article