హైదరాబాద్ శివారు పటాన్చెరులోని ఉస్మాన్ నగర్లో నిర్మించిన 2 కొత్త రిజర్వాయర్లు ప్రారంభానికి రెడీ అయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ఫేజ్-2లో భాగంగా దాదాపు లక్ష మంది జనాభాకు తాగునీటి సమస్యను తీర్చేందుకు ఈ రిజర్వాయర్లు నిర్మించారు. వీటి ద్వారా పటాన్చెరు, తెల్లాపూర్ మున్సిపాలిటీలకు తాగునీరు అందుతుంది. రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఫ్లో మీటర్లు, స్మార్ట్ వాల్వ్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించనున్నారు.