హైదరాబాద్ శివారు బండ రావిర్యాలలో 494 ఎకరాల్లో జపాన్ సహకారంతో పర్యావరణ హిత 'ఎకో టౌన్' రానుంది. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కీటక్యూషు నగర సాంకేతికతతో దీనిని నిర్మిస్తారు. వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ ప్రధాన లక్ష్యాలుగా సాగే ఈ ప్రాజెక్టుపై అధికారులు కసరత్తు పూర్తి చేశారు. త్వరలోనే జపాన్ బృందం బండ రావిర్యాలలో పర్యటించి అందుకు సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టనుంది.