హైదరాబాద్ శివారులో కొత్త బస్ టెర్మినల్ రానుంది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేసారు. ఆర్టీసీ అధికారులతో సమీక్షించి, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని, ఆరాంఘర్లో అధునాతన టెర్మినల్ నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు. ఉద్యోగాల భర్తీ, మహిళా సంఘాల బస్సుల ఒప్పందం, నష్టాల్లో ఉన్న డిపోల పునరుద్ధరణపై కూడా చర్చించారు.