హైదరాబాద్ నగరవాసులకు త్వరలోనే అతితక్కువ ధరకే తాజా మంచినీటి చేపలు దొరకనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ శివారు కొహెడలో 10 ఎకరాల విస్తీర్ణంలో మంచినీటి చేపల ఎగుమతి హబ్తో పాటుగా పెద్ద హోల్సేల్ మార్కెట్ కూడా నిర్మించనుంది. ఇక్కడ్నుంచి వివిధ దేశాలకు చేపల్ని ఎగుమతి చేయటంతో పాటుగా.. దాదాప 5 వేల మందికి ఉపాధి కల్పించనున్నారు.