హైదరాబాద్ శివారులో రూ.5 లక్షలకే 102 గజాల ప్లాటు.. ఒక్క ప్రకటనతో రూ.6.58 కోట్ల స్కాం

5 months ago 19
అత్యాశే పెట్టుబడిగా కేటుగాళ్లు పన్నిన రియల్ ఎస్టేట్ ప్లాన్ బాధితులను నిలువునా ముంచేసింది. రూ. 5 లక్షలు పెట్టుబడిగా పెడితే హైదరాబాద్ శివారులో ప్లాటు రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు, 42 నెలల పాటు నెలకు రూ. 25 వేలు ఇస్తామన్న నకిలీ ప్రకటన నమ్మి 33 మంది బాధితులు ఏకంగా రూ. 6.58 కోట్లు పోగొట్టుకున్నారు. మాయగాళ్లు డబ్బులు వసూలు చేశాక ప్లాట్లు ఇవ్వకపోగా.. ప్రశ్నించిన బాధితులను బౌన్సర్లతో బెదిరించారు. మోసపోయామని గ్రహించిన బాధితులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.
Read Entire Article