హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. రూ. 7,668 కోట్ల వ్యయంతో 62.5 కిలోమీటర్ల నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ గుండా వెళ్లే ఈ మార్గంలో వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇది ప్రయాణ సమయాన్ని దాదాపు గంట సమయం తగ్గిస్తుంది. కృష్ణానదిపై ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి కూడా రానుంది.