భాగ్యనగరానికి మరో అరుదైన వంతెన రానుంది. మీరాలంగేట్ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.319 కోట్లతో కేఎన్ఆర్ సంస్థ టెండర్ దక్కించుకుంది. మూసీ నది ఒడ్డున నిర్మించనున్న ఈ 2.5 కి.మీ. వంతెన, చింతల్మెట్ను బెంగళూరు జాతీయ రహదారితో కలుపుతుంది. ఇది ట్రాఫిక్ సమస్యలను తగ్గించడమే కాక, నగరానికి కొత్త పర్యాటక ఆకర్షణగా నిలుస్తుంది.