నాలుగేళ్ల పాటు ఆర్టీసీ ఎండీగా తనదైన ముద్రవేసిన వీసీ సజ్జనార్.. ఇప్పుడు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే పలువురు ఐపీఎస్లను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేయగా.. సజ్జనార్ను హైదరాబాద్ సీపీగా నియమించింది. మంగళవారం ఆయన సీపీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నగరంలోని డ్రగ్స్, ట్రాఫిక్, ఆన్లైన్ బెట్టింగ్లు, సైబర్ నేరాల గురించి మాట్లాడారు. డ్రంకెన్ డ్రైవ్ విషయంలోనూ అత్యంత కఠినంగా ఉంటామని ఆయన తేల్చిచెప్పారు.