హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కేంద్రం నుంచి త్వరగా అనుమతులు పొందేందుకు శనివారం HAML ఆధ్వర్యంలో ఎంపీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాలు సోమవారం (జూలై 21) ప్రారంభం కానున్న నేపథ్యంలో.. మెట్రో రెండో దశ (2ఏ, 2బీ) విస్తరణకు కేంద్ర అనుమతులు మంజూరు చేసేలా కృషి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి ఎంపీలను కోరారు.