హోం మంత్రి సొంత నియోజకవర్గం పాయకరావుపేట ఇప్పటి వరకు మేజర్ పంచాయతీగానే ఉంది. 2021లో మున్సిపాలిటీ చేసే అవకాశం వచ్చినా స్థానిక కారణాలతో చేయకుండా వదిలేశారు. అయితే, తాజాగా జనాభా లెక్కల ప్రకారం పాయకరావుపేట జనాభా 40 వేలు ఉంది. 30 వేలు జనాభా ఉంటే మున్సిపాలిటీకి అవకాశం. దాంతో ఈసారి ఎలాగైనా పాయకరావుపేటను మున్సిపాలిటీగా చేసి అభివృద్ధి చేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత గట్టి పట్టుదలతో ఉన్నారు.