Bengaluru Sree Vinayaka Enterprises Donation To TTD: తిరుమల శ్రీవారికి భారీగా విరాళాలు అందుతున్నాయి. గత కొద్దిరోజులుగా టీటీడీకి భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. బెంగళూరుకు చెందిన భక్తుడు తాజాగా భారీ విరాళం ఇచ్చారు. శ్రీ వినాయక ఎంటర్ప్రైజెస్ ఎండీ మునిస్వామి నారాయణ గౌడ్ రూ.1.11 కోట్లు విరాళం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి అందించారు. హైదరాబాద్కు చెందిన మరికొందరు భక్తులు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు విరాళాలు అందజేశారు.