తెలంగాణలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ విధానంలో ప్రభుత్వం, ప్రైవేటు కాంట్రాక్టర్లు నిర్మాణ వ్యయాన్ని పంచుకుంటారు. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని మంత్రులు తెలిపారు. కాంట్రాక్టర్లకు ఎస్ఎల్బీసీ ఆర్థిక సహకారం అందించనుంది.