తెలంగాణలో జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలకు వేతనం రూ.300 నుండి రూ.307కి పెరిగింది. ఈ వేతనం ఏప్రిల్ 1 నుండి అమలులోకి రానుంది. ఈ పథకంలో కూలీలకు 100 రోజుల పని కల్పిస్తూ వారి జీవనోపాధిని మెరుగుపరచాలని కేంద్రం ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఈ వేతనం సగటు కూలీ అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదని కూలీలు వాపోతున్నారు. కనీసం రూ.600 వరకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.