తెలంగాణ బడ్జెట్ 2026-27లో గిరిజన సంక్షేమానికి రూ.12,600 కోట్లు కేటాయించారు. 'ఇందిర సౌర గిరి జల వికాసం' పథకం ద్వారా 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు అందించి, 2.10 లక్షల గిరిజన రైతులకు సాగునీరు కల్పించనున్నారు. అలాగే వ్యవసాయానికి రూ.23,179 కోట్లు, సాగునీటి రంగానికి రూ.22,615 కోట్లను కేటాయిస్తూ రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది.