ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సబితా ఇంద్రారెడ్డికి ఊరట లభించింది. సీబీఐ కోర్టు ఆమెను నిర్దోషిగా తేల్చింది. కోర్టు తీర్పుపై స్పందించిన సబితా ఇంద్రారెడ్డి.. 12 ఏళ్లు తాను ఎదుర్కొన్న కష్టానికి న్యాయం జరిగిందని ఆమె అన్నారు. తనను కావాలనే ఇరికించారని, న్యాయవ్యవస్థపై నమ్మకంతోనే నిలబడ్డానని సబితా పేర్కొన్నారు. ప్రజల మద్దతుకు సబితా ఇంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.