కంది ఉత్పత్తిలో స్వావలంబన సాధించే దిశగా హైదరాబాద్లోని ఇక్రిశాట్ సంస్థ 'ఐసీపీవీ 25444' అనే కొత్త కంది వంగడాన్ని ఆవిష్కరించింది. కేవలం 120 రోజుల్లోనే పంట చేతికి రావడం, ఏడాదికి మూడు పంటలు పండించుకునే అవకాశం, చీడపీడలను, 45 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడం దీని ప్రత్యేకతలు. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.