పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టటం తల్లిదండ్రుల బాధ్యత. అయితే.. పిల్లలను క్రమశిక్షణలో పెట్టాలనే తాపత్రయంతో తల్లిదండ్రులు చాలా కఠినంగా వ్యవహరిస్తుంటారు. కొంతమందైతే చిన్న చిన్న కారణాలకే పిల్లలన్ని విపరీతంగా కొడుతుంటారు. అలా ఓ తండ్రి చేసిన పని వల్ల రక్తం పంచుకుని పుట్టిన కొడుకుని చేజేతులా చంపుకోవాల్సి వచ్చింది. ఈ దారుణమైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరేగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.