నల్లమల అటవీ ప్రాంతంలోని అచ్చంపేటకు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు అద్భుతాన్ని ఆవిష్కరించాడు. తన మేధస్సుతో మూడు రకాలుగా ఉపయోగించే త్రీ ఇన్ వన్ హైబ్రిడ్ సైకిల్ను తయారు చేశాడు. తొమ్మిదో తరగతి చదువతున్న గగన్చంద్ర.. టీచర్ల సహకారంతో ఈ సైకిల్ను డిజైన్ చేశాడు. అతడి గురించి తెలుసుకున్న సీఎం రేవంత్ అభినందనలు తెలిపి.. మరిన్న ఆవిష్కరణలకు మద్దతు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు.