140 ఏళ్ల బంధం.. మర్రిచెట్టు కోసం ఊరంతా ఒక్కటైంది!

1 year ago 32
మహబూబాబాద్ జిల్లాలో వారం రోజుల క్రితం కురిసిన గాలివాన బీభత్సానికి 140 సంవత్సరాల చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ముత్యాలమ్మ మర్రి చెట్టు నేలమట్టమైంది. వేర్లతో సహా పెకిలించేసినట్లు కూలిపడటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ పూర్వీకుల జ్ఞాపకాలకు సాక్ష్యంగా ఉన్న ఆ మర్రి చెట్టు నెలకొరగటంతో శోకసంద్రంలో మునిగిపోయారు. గుడిలో దేవతను ఎలా కొలుస్తారో.. అదే దైవత్వంతో పూజించే ఆ మర్రి చెట్టు కూలిపోవటం గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది. తమ పూర్వీకుల జ్ఞాపకంగా భావించే ఆ చెట్టును తిరిగి నిలబెట్టాలని గ్రామస్థులు సంకల్పించారు. గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు కలిసి చర్చించి, తమ ప్రయత్నంతో మళ్లీ నిలబెట్టారు.
Read Entire Article