Army Jawan Murali Naik Killed 14 Pakistanis: జమ్మూకశ్మీర్లో ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందాడు. సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ, లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద శత్రువులను అడ్డుకొని ప్రాణాలర్పించాడు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మంత్రి సవిత మురళీ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు. మాజీ సీఎం జగన్ సైతం ఫోన్లో పరామర్శించారు.