బలిమెల ఘటనలో అమరులైన 33 మంది గ్రేహౌండ్స్ సిబ్బంది కుటుంబాలకు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు న్యాయం జరిగింది. గాజులరామారంలో నిలిచిపోయిన ఇళ్ల పట్టాల పంపిణీ సమస్యను రేవంత్ ప్రభుత్వం పరిష్కరించగా.. మంగళవారం డీజీపీ శివధర్ రెడ్డి బాధిత కుటుంబాలకు పట్టాలు అందజేశారు. ఘటన సమయంలో ఎస్సైబీ డీఐజీగా ఉన్న శివధర్ రెడ్డి.. ఇప్పుడు డీజీపీ హోదాలో పట్టాలు పంపిణీ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు.