డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్న నిరుద్యోగులకు భారీ శుభవార్త. రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రైవేట్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. కామారెడ్డి జిల్లాలోని కలెక్టరేట్ లోని మొదటి అంతస్థులో జిల్లా ఉపాధి అధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉండనున్నాయి. ఉదయం 10.30 గంటలకు ఈ జాబ్ మేళా ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఇంటర్వ్యూలు జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చని తెలిపారు.