సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన 5 కేసులను కొట్టివేస్తూ.. హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హుజూర్నగర్ ఉపఎన్నిక సమయంలో రేవంత్ రెడ్డిపై నమోదైన కేసులను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు రేవంత్ రెడ్డిపై.. పలు ఫిర్యాదులు నమోదు కావడంతో.. కేసులు నమోదయ్యాయి. అయితే వాటిని కొట్టివేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేయడంతో.. వాటిని కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.