శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నిత్య పెళ్లికూతురు వాణి మోసాలు కలకలం సృష్టిస్తున్నాయి. మధ్యవర్తుల సహకారంతో కర్ణాటక, కేరళ, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాల యువకులను పెళ్లి పేరుతో వంచించి.. లక్షలాది రూపాయలు వసూలు చేసి పారిపోవడం ఆమె పని. తాజాగా బాధితులు ఇచ్ఛాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. దాదాపు 8 మందిని ఈమె మోసం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.