సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. రహదారి పనులలో భాగంగా 20 ఏళ్ల కిందట తొలగించిన గుడిని మళ్లీ.. యథాస్థానంలో ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు. రహదారి విస్తరణ పనుల కారణంగా 2005-06లో సంగారెడ్డి చౌరస్తాలోని భూలక్ష్మమ్మ గుడిని తొలగించారు. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులలో గుడిని తరలించాల్సి వచ్చిందన్న జగ్గారెడ్డి.. ఆ గుడిని పూర్వపు స్థానంలో ఏర్పాటు చేయిస్తామని ప్రకటించారు.