Telugu Youth Died In Fire Accident In London: ఏపీకి చెందిన యువకుడు లండన్లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన అభిషేక్ 2023లో ఎంబీఏ చదివేందుకు లండన్ వెళ్లారు. క్రొయిడాన్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయితే మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఏపీ ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆస్కార్రావు కుమారుడు అభిషేక్. ఆయన భార్య 20 ఏళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయారు.