2600 సార్లు తిరుమల కొండెక్కిన భక్తుడు.. 3350 సార్లు దర్శనం.. శ్రీవారిపై 70 ఏళ్ల వృద్ధుడి అనన్య భక్తి!

5 months ago 4
శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలమంది కాలినడకన తిరుమలకు వెళ్తుంటారు. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల ద్వారా నిత్యం ఎంతో మంది భక్తులు కొండపైకి చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. మనసులో శ్రీవారిని స్మరించుకుంటూ ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ కొండపైకి చేరుకుంటారు. అయితే ఒకే వ్యక్తి 2600 సార్లు తిరుమల కొండెక్కి శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలుసా.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుపతికి చెందిన రమణమూర్తి అనే వ్యక్తి తాను 2600 సార్లు తిరుమల కొండెక్కినట్లు ఆ వీడియోలో చెప్తున్నారు. ఏడాది కిందటి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Read Entire Article