శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికుడి వద్ద 3.5 కిలోల అక్రమ బంగారం పట్టుబడింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బంగారాన్ని చట్టబద్ధంగా పొందడమే సురక్షితమని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. గత కొద్ది నెలలుగా శంషాబాద్ విమానాశ్రయంలో ఇలాంటి అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. వివిధ రూపాల్లో.. చాకచక్యంగా బంగారాన్ని తరలించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. నిఘా పెంచిన అధికారులు ఎప్పటికప్పుడు వారి ప్రయత్నాలను భగ్నం చేస్తున్నారు.