హైదరాబాద్లో వానాకాలం నేపథ్యంలో ముంపు నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలోని నాలాల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించి, అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. రసూల్పురా నాలా వద్ద కబ్జాలను తొలగించడంతో పాటు, ప్యాట్నీ వద్ద వాణిజ్య నిర్మాణాలను కూల్చివేశారు. ఈ చర్యల ద్వారా దశాబ్దాలుగా ముంపు సమస్యతో బాధపడుతున్న సుమారు 30 వేల కుటుంబాలకు ఊరట లభించింది. నగరంలో నాలాల పరిస్థితిపై సమగ్ర నివేదికలు తెప్పించుకొని తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.