హైదరాబాద్ను ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాలతో కలిపే రాజీవ్ రహదారిని త్వరలోనే ఎనిమిది లైన్లకు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. సుమారు మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ రహదారి.. గత దశాబ్దన్నర కాలంలో నాలుగు లైన్ల రాష్ట్ర రహదారిగా మారింది. అయితే ఈ మార్గంలో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా.. ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.400 కోట్లు ఖర్చు చేసి.. దీనిని ఎక్స్ప్రెస్ హైవేగా మార్చాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.